‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’. రాజేంద్రప్రసాద్, పధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు ప్రధాన తారాగణం. మహేష్చంద్ర సినిమా టీమ్ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకులు చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది. యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?, ఎలా ఎదగాలనే సందేశం ఈ సినిమాలో ఉంది’ అని చెప్పారు.
‘ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందనే పాయింట్ని దర్శకుడు మహేష్చంద్ర అద్భుతంగా డీల్ చేశాడు. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’ తరహాలోనే సందేశాన్ని అందిస్తూనే, యువతరాన్ని ఆకట్టుకునే అంశాలున్న సినిమా ఇది’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు మహేష్చంద్ర మాట్లాడుతూ, ‘నా తొలి సినిమా ‘ప్రేయసి రావే’ నాకెంతో గొప్ప పేరు తీసుకొచ్చింది. ఈరోజుకీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి ఉంది. ఈ సినిమా కూడా అదే స్ధాయిలో నిలిచిపోయే సినిమా. ముగ్గురు తండ్రుల కథలా అనిపిస్తూనే మూడు జంటల మధ్య నడిచే కథ ఇది. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.
మంచి సందేశాత్మక చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



