- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ “తొలి ముద్ద” ప్రారంభమైంది. ఈ ప్రథకం ద్వారా పిల్లలకు రెడీ టూ కుక్ ఫుడ్( ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్గా అందించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుంది. పౌష్టికాహారం లేకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది’ అని CM పేర్కొన్నారు.

- Advertisement -



