- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నిర్ణయంతో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే ఉద్యోగులకు వర్తించనుంది. దీంతో ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం పని చేయాలని ఈ సందర్బంగా ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -