- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్లు దశల వారీగా పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం డబ్బులు ఖాతాల్లో జమ చేస్తోంది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మిగతా పనులను వేగవంతంగా చేయడానికి సోమవారం రూ.13 కోట్లు విడుదల చేయనున్నారు. 1300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదును నేరుగా జమ చేస్తారు. కాగా ప్రతి సోమవారం లబ్ధిదారులక ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
- Advertisement -