Saturday, June 14, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యార్థులకు శుభవార్త..నేరుగా అకౌంట్లోకే డబ్బులు

విద్యార్థులకు శుభవార్త..నేరుగా అకౌంట్లోకే డబ్బులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీ (వెనుకబడిన తరగతులు) సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యా సంవత్సరం (2025-26) ప్రారంభం నేపథ్యంలో.. ప్రభుత్వ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తు నేటి యువతపైనే ఆధారపడి ఉందని గుర్తుచేస్తూ, బీసీ సంక్షేమ శాఖలో పని చేసే ప్రతి ఒక్కరూ విద్యార్థులను విద్యాపరంగానే కాకుండా, అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దేలా పూర్తి చిత్తశుద్ధితో శ్రమించాలని మంత్రి పిలుపునిచ్చారు. బుధవారం బీసీ సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ మార్గదర్శకాలను వెల్లడించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాలతో విద్యను అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కేవలం అకడమిక్ అంశాలపైనే కాకుండా.. విద్యార్థుల ఆరోగ్యం, వసతి సౌకర్యాలు కూడా వారి విద్యా ప్రగతికి అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నాలుగు నెలల అద్దె బకాయిలను ఇప్పటికే విడుదల చేసిందని, భవనాల యజమానులతో సంప్రదించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

పాఠశాలలు, హాస్టళ్లలో నిత్యం పరిశుభ్రత పాటించాలని, దోమల నుంచి రక్షణ కోసం నెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, వసతి సామాగ్రిని విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వెంటనే అందించాలని మంత్రి స్పష్టం చేశారు. సకాలంలో వస్తువులు అందడం వల్ల విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది.

ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు వారి కాస్మోటిక్ చార్జీలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థులందరికీ బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నిర్ణయం పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు, విద్యార్థులలో ఆర్థిక బాధ్యతను, స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహిస్తుంది. త్వరలోనే వారి బ్యాంక్ అకౌంట్లో నేరుగా ఆ ఛార్జీలు జమ అవుతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -