- Advertisement -
- – విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణా శిబిరం…
– ముగింపు కు హాజరైన ఎంఈఓ ప్రసాదరావు…
నవతెలంగాణ – అశ్వారావుపేట - శిక్షణ ఏదైనా సద్వినియోగం చేసుకున్న వారే సత్ఫలితాలు పొందుతారని ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు అన్నారు. గత 15 రోజులుగా అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మండల విద్యాధికారి పి.ప్రసాదరావు మాట్లాడుతూ 15 రోజుల నుండి శిక్షణా శిబిరాన్ని చక్కగా నిర్వహించారని,ఇందులో విద్యార్ధులు అనేక అంశాలను తెలుసుకోవడంతో పాటు ఆటలు కూడా అడుకోవడం వారికి ఈ వేసవిలో ఆటవిడుపుగా ఉంటుందని అన్నారు.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో సహా షెడ్యూల్ ప్రకారం అన్ని అంశాలను నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. విద్యార్ధులు ఈ శిబిరం ద్వారా ఏ మేరకు ఉపయోగం పొందారనేది వారితోనే చెప్పించారు.విద్యార్ధులు ఈ శిబిరంలో తయారు చేసిన వివిధ కళాకృతులను,చిత్రకళను పరిశీలించారు.అనంతరం ప్రతిభకనబర్చిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్, నర్సింహారావు,పి.ఇ.టి రాజు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
- Advertisement -