- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సైనా వెల్లడించారు. ఎంతో ఆలోచించి, చర్చించిన అనంతరం తాను, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. బ్యాడ్మింటన్ ఆడుతూ వీరి మధ్య మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. 2018లో సైనా, కశ్యప్ పెళ్లి చేసుకున్నారు.
- Advertisement -