నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గోప స్వర్ణోత్సవాల కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్వీ హోటల్లో సంబరాలు నిర్వహించారు. ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. గౌడుల ఐకమత్యం కోసం కృషి చేస్తున్న గోపా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ సంవత్సరం స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగిందని, ఈ అసోసియేషన్ 2-8-1975 న ఏర్పాటు చేశారని కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న గోపా సభ్యులు బొమ్మకంటి బాలరాజు గౌడ్, దంతూరి కుమారస్వామి గౌడ్, బబ్బూరి హరినాథ్ గౌడ్, గోదా వెంకటేశ్వర్లు గౌడ్ , బత్తిని రాములు గౌడ్, డి లక్ష్మి నారాయణ గౌడ్,దైతుల ఆగయ్య గౌడ్,, నల్లమాస కుమార్ గౌడ్, నిమ్మల సురేశ్ గౌడ్ , రాంపల్లి సాయి భాను గౌడ్, ఏ మహేశ్ గౌడ్ లు పాల్గొన్నారు.
‘గోప` స్వర్ణోత్సవాలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES