- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు మానుకోవాలని టిఆర్ఎస్ బాల్కొండ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం ప్రవీణ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గ్రామాల్లో రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. వారి వల్ల గ్రామాల్లో కక్షలు పెరిగి అభివృద్ధి పనులు జరగడంలేదని అన్నారు. రాజకీయాల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
- Advertisement -



