Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా వైద్యానికి ప్రభుత్వ సదుపాయాలు

ప్రజా వైద్యానికి ప్రభుత్వ సదుపాయాలు

- Advertisement -

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
బాధితులకు రూ.7,49,500 చెక్కుల పంపిణీ..
నవతెలంగాణ – బెజ్జంకి
: ప్రజారోగ్య భద్రతకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని..అప్పులు చేసి కార్పోరేట్ ఆస్పత్రులకు వైద్యానికి వెళ్లకుండా ప్రభుత్వం కల్పించిన ఆరోగ్య శ్రీ, ఎల్ఓసీ వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలను కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండలంలోని అయా గ్రామాలకు చెందిన సుమారు 31 మంది బాధితులకు రూ.7,49,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పొందాలని ఎమ్మెల్యే సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇసుక కొరత రాకుండా ప్రభుత్వ అదేశానుసారం అందించాలని తహసీల్దార్ చంద్రశేఖర్ కు సూచించారు.అంతకుముందు మండల కేంద్రంలోని డబుల్ ఇండ్లను ఎమ్మెల్యే సందర్శించి సమస్యలడిగి తెలుసుకున్నారు.త్రాగు నీటి కొరతను త్వరితగతిన పరిష్కారించాలని అధికారులను ఎమ్మెల్యే అధేశించారు.అసంపూర్తిగా నిలిచిన అరుందతి కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు.పూర్తిస్థాయి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రణాళికను తయారుచేయాలని అధికారుల సూచించారు.ఏఎంసీ చైర్మన్ క్రిష్ణ,ఎంపీడీఓ ప్రవీన్,మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్, నాయకులు మధుసూధన్ రెడ్డి,జంగిలి తిరుపతి యాదవ్,బైర సంతోష్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,పులి రమేశ్,పలువురు శ్రేణులు హజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -