Wednesday, January 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపండగ పూట గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త

పండగ పూట గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతి పండగ పూట గ్రామ పంచాతీయలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మంగళవారం ఆర్ధిక శాఖ ఫండ్స్ రిలీజ్ చేసింది. నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది.  ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్  మెంబర్లకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల సమయంలోనే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -