Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూనియర్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల సంబంధించిన కరపత్రాలను అధ్యాపకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంగ్లీష్ అధ్యాపకురాలు వైష్ణవి మాట్లాడుతూ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రభుత్వం అధ్యాపకులను ఈ సంవత్సరం పూర్తిస్థాయిలో నియమించడం జరిగిందన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, కళాశాలలో  అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయన్నారు.అదే విధంగా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ లో కానీ, ఇతర పోటీ పరీక్షల్లో అయినా ఇలాంటి ఫీజు రీయంబర్స్మెంట్ కట్టవలసినటువంటి అవసరం లేదని పేర్కొన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇటీవల పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు మధు, రాజ్ కుమార్, గంగాధర్, మహేందర్, గంగారాం, వెంకటేష్, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -