– రాజీవ్ యువ వికాసం వెంటనే అమలు చేయాలి
– 23న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎల్డీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
– పాల్గొననన్ను ప్రధాన పార్టీల నాయకులు : తెలంగాణ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్
నవతెలంగాణ – హైదరాబాద్
విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ నిర్ల క్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23న ఇందిరా పార్క్ వద్ద తెలం గాణ లోక్దళ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు పిలుపు నిచ్చినట్టు రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ తెలిపారు. హైదరాబాద్లోనిరాష్ట్ర కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రయివేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు, రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం, విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద వంటి అంశాలపై ఈ ధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం, దేశంలోని ప్రతి ప్రయివేట్ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించి, వారికయ్యే ఫీజును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 55:45 నిష్పత్తిలో భరించాలన్నారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నప్పటికీ, రాష్ట్రంలో అమ లుకు నోచుకోవడం లేదన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో అమ లైతే, సుమారు 9 లక్షల మంది పేద విద్యార్థులు ప్రయివేట్ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉంటుందని వివరించారు. సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో ఈ చట్టాన్ని బలపరిచిందని గుర్తుచేశారు. నూతన విద్యా విధానంలో ఉచిత నిర్బంధ విద్యను 6 నుంచి 18 ఏండ్ల వయసు వరకు వర్తిస్తుందన్నారు. కావున, ప్రయివేట్ పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్ స్థాయి లోనూ బడుగు వర్గాలకు 25 శాతం సీట్లు కేటాయించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని కోరారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఆశలు రేకెత్తించిన రాజీవ్ యువ వికాసం పథకం మార్చి 17, 2025న ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఘనంగా ప్రారంభించారని గుర్తు చేశారు. మూడు నెలలు గడుస్తున్నా పథకం అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, లబ్దిదారులకు నిరాశ ఎదురవుతోందని దిలీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ దరఖాస్తులు, తిరస్కరణలు
రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం, భారీ సబ్సిడీలను ప్రకటించడంతో ఏకంగా 16 లక్షలకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు జరిగిన దరఖాస్తుల పరిశీలనలో సుమారు 6.6 లక్షల దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యా యన్నారు. ఈ తిరస్కరణలు పారదర్శకంగా జరిగాయా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రుణాల మంజూరులో జాప్యంతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రుణ పత్రాలు పంపిణీ చేస్తామని ప్రకటించినా, అది వాయిదా పడిందన్నారు. జూన్ 5న కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినా, ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం లేదని తెలిపారు. ”త్వరలో పంపిణీ చేస్తాం” అనే మాటలు కాలయాపనకేనని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారన్నారు. పథకం ప్రారంభంలో చూపి న ఉత్సాహం అమలులో కొరవడటం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని, కేవలం ఓట్ల కోసమే ఈ పథకాన్ని ప్రక టించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయ న్నారు. సమగ్ర ప్రణాళిక, పటిష్టమైన అమలు యంత్రాంగం లేకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమన్నారు.
వ్యవసాయ రంగంలో సంక్షోభం
వర్షాకాలం ప్రారంభమైనా, రాష్ట్రంలోని అన్నదాతలు ప్రస్తుతం తీవ్రమైన విత్తనాల కొరతను రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి వంటి ప్రధాన పంటలకు అవసరమైన విత్తనాలు సకాలంలో తగినంత పరిమాణంలో లభ్యం కావడం లేదని దిలీప్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. రెండేండ్లుగా నకిలీ విత్తనాల వల్ల వందలాది గ్రామాల్లో మొలకెలు రాకపోవడం, పంట దిగుబడులు గణనీయంగా తగ్గడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. రైతులు భారీగా నష్టపోయిన చేదు అనుభవాలు పునరావతం కాకుండా చూడటం అత్యావశ్యకమన్నారు. విత్తనాల సరఫరాకు ముందు ప్రామాణిక ల్యాబ్ పరీక్షలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణమే రూ. 25,000 వరకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23 సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎల్డీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర సిద్ధార్థ ,వైస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, హైదరాబాదు అధ్యక్షులు అజాజ్ అహ్మద్, రాష్ట్ర నాయకులు విశాల్ వంజారీ, జనరల్ సెక్రటరీలు ముద్దం మల్లేశ్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES