Friday, June 13, 2025
E-PAPER
Homeజిల్లాలుబిల్లులు రాలేదని సర్కార్ బడికి తాళం..

బిల్లులు రాలేదని సర్కార్ బడికి తాళం..

- Advertisement -

ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడిన ఎస్ఐ నీరేష్
డీఈఓ హామీతో తాళం తీసిన కాంట్రాక్టర్ 
నవతెలంగాణ – చేర్యాల 
: పాఠశాల అభివృద్ధి కోసం చేసిన పనులకు బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ పాఠశాల ప్రారంభం రోజే తాళం వేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఆకునూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు సంవత్సరాల క్రితం పాఠశాల అభివృద్ధికి మన ఊరి మన బడి నిధుల ద్వారా నూతన డైనింగ్ హాల్, టైల్స్, ఎలక్ట్రిషన్ వర్క్ లు చేసిన బిల్లులు రూ. 8.50 లక్షలు రావాలని అనేకసార్లు జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నాడు. అయినా బిల్లులు మంజూరు చేయలేదని తెలిపాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని మాజీ ఎస్ఎంసీ చైర్మన్, కాంట్రాక్టర్ కోతి దాసు వాపోయాడు. ఈ విషయంపై గురువారం పాఠశాలలు పున:ప్రారంభం రోజు హైస్కూల్ కు తాళం వేశారు. ఈ సంఘటనపై చేర్యాల ఎస్ఐ పి. నీరేష్ పాఠశాలకు చేరుకొని ఆరా తీసి వెంటనే డీఈఓ, ఏసీపీలతో మాట్లాడించి సర్ది చెప్పడంతో తాళం తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -