నవతెలంగాణ – ఆర్మూర్
ప్రభుత్వ పాఠశాలలను సధ్వినియోగం చేసుకోవాలనీ స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భం లో “బడిబాట” కార్యక్రమం లో భాగంగా మండలంలోని అంకాపూర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొని పిల్లలకు ఉచిత యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు వినీయోగించుకోవాలని ,నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో నే లభిస్తున్నదని తెలిపారు. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు . ఈ కార్యక్రమం లో ఎంపీడీవో బ్రహ్మానందం, ఐకెపి ఎపిఎం గంగారాం,స్థానిక ప్రథనో పాధ్యాయులు నర్సయ్య పి ఎస్ హెచ్ఎం, సుభాషిణి, రాజారాని,సంతోష్, బట్టు రఘుపతి , వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES