Tuesday, June 17, 2025
E-PAPER
Homeజిల్లాలుకుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ప్రభుత్వ అధ్యాపకుడు

కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ప్రభుత్వ అధ్యాపకుడు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణానికి చెందిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ జక్కుల రాధా కిషన్ ఆయన కుమారుడిని ఏడవ తరగతిలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం చేర్పించినట్టు ప్రధనోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నందిపేట మండలంలోని ఐలాపూర్ జూనియర్ కళాశాల లెక్చరర్ గా పనిచేస్తూ, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని , ఆదర్శప్రాయంగా అడ్మిషన్ చేయించడం అభినందనీయమని అన్నారు. ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకొని ఇతరులు కూడా ఇదే మార్గంలో వెళ్లి ప్రభుత్వ పాఠశాలలను మొనగడలో ఉంచి ప్రభుత్వ విద్యా విధానానికి సహకరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లెక్చరర్ ను ఉపాధ్యాయ బృందం సైతం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -