నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆదివారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిఆర్వో ఆదిమూలం సురేష్ కుటుంబ సభ్యుల తో కలసి ఎల్లమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. ఆదివారం కావడంతో భక్తుల సందడి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వేడుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర వెంకటేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు క్యాసాగళ్ల చందు, ఆదిమూలం వీరస్వామి, దికొండ వెంకటేష్ లు పాల్గొన్నారు.
ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES