- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ జన సమితి ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయం టీజేఎస్, వివిధ సామాజిక శక్తుల ప్రజా విజయమని తెలిపారు. ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుం దని అభినందించారు. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా అమల్లోకి తీసుకురా వాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకున్న 32 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి ప్రాతినిథ్యం లేకుండా చేసిందని విమర్శించారు.
- Advertisement -