నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతనంగా విచ్చేసిన గౌరవ బాన్సువాడ డిఎల్పిఓ ప్రసాద్ సార్ ను గ్రామపంచాయతీ సిబ్బంది శుక్రవారం షాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం గ్రామపంచాయతీ యొక్క రికార్డులను డి ఎల్ పి ఓ ప్రసాద్ పరిశీలించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల యొక్క పురోగతిని మరియు ఇంటి పన్నుల వసూలు యొక్క పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరియు ఇంటి పన్ను వసూలు 100% పూర్తిచేయాలని జిపి అధికారులకు ఆదేశించినారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు వేయడం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరి వెంట ఎంపీడీవో శ్రీనివాస్ మరియు ఎంపీవో రాము , జుక్కల్ పంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిఎల్పిఓను సన్మానించిన జీపీ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



