- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నీలు పటేల్ ఆధ్వర్యంలో 79వ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు పెద్దలు, వ్యాపారవేత్తలు , రైతులు కర్షకులు కార్మికులు ఆహ్వానించి సన్మానించడం జరిగింది. ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా వచ్చిన అవానితులందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు నీలు పటేల్ , మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, మారుతి పటేల్, వాస్రే రమేష్ , మాజీ ఉప సర్పంచ్ భాను గౌడ్, నాయకులు దాదారావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -