- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ప్రభుత్వాస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి ఆవరణంలో సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా వైద్యులు, నర్సులు, సిబ్బంది స్వీట్లను పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -