నందమూరి బాలకృష్ణ వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రతి కొత్త రిలీజ్తో తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ ఎపిక్ ఎన్బీకే 111ను ఆయన పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ ‘వీరసింహ రెడ్డి’ తర్వాత బాలకష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవ చిత్రం. ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ని నిర్మిస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, వద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయ దశమి శుభ సందర్భంగా, ఎన్బీకే 111 చిత్ర ప్రారంభానికి నిర్మాతలు ముహూర్తం ప్రకటించారు.
ఈనెల 24న గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరగనుంది.మొదటిసారిగా దర్శకుడు గోపీచంద్ మలినేని హిస్టారికల్ ఎపిక్ జోనర్లో సినిమా చేస్తున్నారు, తనదైన ముద్ర వేసిన మాస్ అప్పీల్ను కొత్త జోనర్కి తీసుకువస్తున్నారు. కమర్షియల్గా బ్లాక్బస్టర్లను అందించడంలో పేరుగాంచిన గోపీచంద్ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతార్లో చూపించే కథనాన్ని రూపొందిస్తున్నారు. గొప్ప చారిత్రక నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం, ఇంటెన్స్, ఎమోషన్, యాక్షన్, అద్భుతమైన విజువల్స్, లార్జర్ దెన్ లైఫ్ గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.
24న గ్రాండ్ ఓపెనింగ్
- Advertisement -
- Advertisement -