- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని ఇంధన్ పల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమం ను నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రాజేందర్, ఎఫ్ఆర్వో శ్రీధర్ చారి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని,పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం విద్యార్థు లకు వ్యాసరచన ,డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ రవి విద్యార్థులు, ఉపాధ్యాయులు , పీడీ. శివనూరి తిరుపతి పాల్గొన్నారు.
- Advertisement -