- Advertisement -
బార్ అసోసియేషన్ నాయకులు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం 
నవతెలంగాణ – భూపాలపల్లి టౌన్
జిల్లా కేంద్రంలో రేపు నూతనంగా నిర్మించనున్న కోర్ట్ భవన సముదాయం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష కుమార్ సింగ్,జస్టిస్ ఈ. వి.వేణు గోపాల్, జస్టిస్.నమవరపు రాజేశ్వర్ రావులను భూపాలపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులో కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సంగేమ్ రవీందర్,కోశాధికారి మంగళపల్లి రాజ్ కుమార్,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు భూక్య రమేష్ నాయక్ పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    