- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంచంద్రయ్య మార్కెట్ యార్డు చైర్మన్ హరలింగం ఆద్వర్యంలో భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి నాణ్యతతో కూడిన ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రవిందర్ రెడ్డి నీలకంఠ రాజశేఖర్ రాము తదితరులు పాల్గొన్నారు
- Advertisement -