Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగామలో ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి భూమి పూజ

జనగామలో ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి భూమి పూజ

- Advertisement -

– గ్రామదేవతలకు ఆలయ నిర్మిస్తున్న శేఖర్ గౌడ్ 
నవతెలంగాణ – కామారెడ్డి 

జనగామ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి బుధవారం రాజగౌని శేఖర్ గౌడ్  భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని 6 పిల్లర్లతో అద్భుతంగా నిర్మిస్తానని పేర్కొన్నారు. భూమి పూజ అనంతరం వెంటనే పనులను ప్రారంభించడం విశేషం. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిస్వార్థంగా చేస్తున్న ఈ సేవను గ్రామస్తులు అభినందించారు. రాజగౌని శేఖర్ గౌడ్ కు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -