Monday, June 23, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు సాధ్యం

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు సాధ్యం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని మండల ఏపీఓ రవీందర్ అన్నారు. సోమవారం మండలంలో జల శక్తి అభియాన్ కేంద్ర మంత్రిత్వ శాఖ సెంట్రల్ టీం మండలంలో చేపట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన 71 పనులను జలశక్తి అభియాన్ ద్వారా సెంట్రల్ టీం శాస్త్రవేత్త  కే. రాంబాబు పరిశీలించారు. వ్యక్తిగత సామాజిక ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్, కుంటలు, రూట్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జల శక్తి అభియాన్ పనులను సూచించారు. రాంపూర్, తిమ్మాపూర్, సింగరాయపేట, చింతగూడ, మల్యాల, పొనకల్, బాదంపల్లి, మురిమడుగు, వెంకటాపూర్, కలమడుగు, మొర్రిగూడ, ఇంధన్ పల్లి, కామన్ పల్లి, కిష్టాపూర్, కవ్వాల్ పరిశీలించడం జరిగింది, జిల్లా కార్యాలయ సిబ్బంది, సత్యనారాయణ, సదానందం, జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈసీ విలాస్, టి ఏ, ఎఫ్ ఏ  పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -