Thursday, December 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగ్రూప్-3 ఫలితాలు విడుదల

గ్రూప్-3 ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. టీజీపీఎస్సీ తెలంగాణ గ్రూప్-3 ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. 1388 మంది అభ్యర్థుల ప్రొవిజనల్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

2022లో 1388 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్-3 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించారు. అయితే గ్రూప్-1, 2 వివాదాలు, పలు కోర్టు కేసుల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. తాజాగా, ఈ ఏడాది మార్చి 14న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు కమిషన్ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -