– రోజ్బడ్స్ స్కూల్ చైర్మెన్ శ్రీకాంత్రెడ్డి
– వైభవంగా పాఠశాల 38వ వార్షికోత్సవం
నవతెలంగాణ – హైదరాబాద్
విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకుంటేనే భవిష్యత్లో ఎదుగుతారని రోజ్బడ్స్ స్కూల్ చైర్మెన్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని హరిహరకళాభవన్లో శుక్రవారంనాడు స్కూల్ 38వ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మెన్ కె.శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్స్ కె.రూపారెడ్డి, కె.కౌశిక్ రెడ్డి, ప్రిన్సిపాల్ జి.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కె.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని అన్నారు. ఆటలు, పాటలు, నత్యాలు, వ్యాయామం మొదలైన అన్ని కళల్లో రాణిస్తూ, ఉన్నత శిఖరాలను అధిగమిస్తూ దేశాన్ని అభివద్ధి పథంలో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ సిందూర్, నరసింహ అవతార్, రఘుకుల తిలక, పాల్ కావడి, మేఘం కరుకుతు మొదలైన నత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల హావభావాలు ఆహుతులను అలరించాయి.
విద్య, క్రమశిక్షణతోనే ఎదుగుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



