- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో బుధవారం కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో రెండు ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన జీఎస్టీ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల విషయం తెలియగానే, మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కార్యాలయానికి చేరుకున్నారు.
- Advertisement -