Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఉమ్మడి జిల్లాల వారీగా హ్యామ్‌ రోడ్ల ప్రతిపాదనలు

ఉమ్మడి జిల్లాల వారీగా హ్యామ్‌ రోడ్ల ప్రతిపాదనలు

- Advertisement -

విస్మరించిన జిల్లాలకు తొలి ప్రాధాన్యత
కొత్తగా భూసేకరణ అవసరం లేదు
వర్షాలతో దెబ్బతిన్న వాటికి
రూ. 100 కోట్లు అడుగుతా
ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌
ఉమ్మడి జిల్లాల వారీగా తుది హ్యామ్‌ రోడ్ల ప్రతిపాదలను రూపొందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో ఆ శాఖపై సుధీర్ఘంగా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, రోడ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మల్‌ రెడ్డి రాంరెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, ఆర్‌ అండ్‌ బీ సీఈలు జయభారతి, మోహన్‌నాయక్‌, రాజేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్‌ అన్ని జిల్లాల ఎస్‌.ఈ లు, ఈ.ఈ లు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన వెనుకబడిన జిల్లాలకు హ్యామ్‌లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. హ్యామ్‌ రోడ్ల కోసం కొత్తగా భూసేకరణ అవసరం లేదనీ, కావున అదనపు భారం ఏమి ఉండదని మంత్రి పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఉన్న రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. హ్యామ్‌ ప్రతిపాదనల్లో 10 కి.మీ పైగా ఉన్న రోడ్లను తీసుకోవాలని కోరారు. కనెక్టివిటీ కారిడార్‌ను డెవలప్మెంట్‌ చేసే విధంగా ఉండాలని సూచించారు. దీంతో రూరల్‌ తెలంగాణ సోషియో ఎకనామిక్‌ యాక్టివిటీ పెరుగుతున్నదన్నారు. హ్యామ్‌లో సింగిల్‌ లేన్‌ నుంచి డబుల్‌ లేన్‌, డబుల్‌ లేన్‌ నుంచి పీవుడ్‌ షోల్డర్స్‌ (10 మీటర్ల) రోడ్డు..ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న ఫోర్‌ లేన్‌ రోడ్లు కొన్ని హ్యామ్‌ లో తీసుకుంటామన్నారు. దాదాపుగా 4వేల కి.మీ రోడ్లు రెన్యూవర్‌ చేస్తామన్నారు. కొత్త ఇన్ఫ్రా పెంచడంతో పాటు పాత రోడ్ల నిర్వహణను బలోపేతం చేస్తామని వివరించారు. దీంతో పాటు అధిక వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల కోసం అత్యవసరంగా రూ. 100కోట్లు రిలీజ్‌ చేయమని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని మంత్రి చెప్పారు.ఫీల్డ్‌ నుండి పూర్తి వివరాలు తెప్పించాలని సీఈ మోహన్‌ నాయక్‌ను మంత్రి ఆదేశించారు. వచ్చే రెండ్లేండ్లల్లో హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రధాన భవనాలు అన్ని పూర్తిచేసేలా టార్గెట్‌ పెట్టుకున్నామని తెలిపారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తరభాగం భూసేకరణలో భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలనీ అధికారులను మంత్రి ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad