- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన గురుస్వామి ముద్దరవేని సురేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం పెద్దమ్మతల్లి ఆలయం నుంచి గ్రామంలో పురవీధుల్లో హనుమాన్ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. గ్రామస్తులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టఐశ్వర్యాలు కలుగాలని ఆకాంక్షించారు. జై ఆంజనేయ…జైజై ఆంజనేయ అంటూ నినాదాలు చేశారు.
- Advertisement -



