Monday, June 16, 2025
E-PAPER
Homeఖమ్మంగట్టిగా "బట్టి" పుట్టిన రోజు వేడుకలు..

గట్టిగా “బట్టి” పుట్టిన రోజు వేడుకలు..

- Advertisement -

వృద్ధాశ్రమంలో ఒక వర్గం – ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరొక వర్గం నిర్వహణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు పుట్టిన రోజు వేడుకలను నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఆదివారం ఘనం(గట్టి)గానే నిర్వహించి నప్పటికీ కాంగ్రెస్ పాత కొత్త వర్గాలుగా వేర్వేరుగా నిర్వహించారు.
అమ్మ సేవా సదనంలో… సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు నేతృత్వం లో అమ్మ సేవా సదనం వృద్దులు ఆశ్రమంలో బర్త్ డే కేక్ కట్ చేసి అందులోని వృద్దులకు భోజనం వసతి కల్పించారు. కాంగ్రెస్ అనుబంధ పలు సంఘాలు కార్యకర్తల భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, బండారు మహేష్,సెక్రెటరీ కొప్పుల శ్రీను,మాజీ సర్పంచ్ దాసరి నాగేంద్రరావు, రాజశేఖర్,సింహాచలం, తమ్మిశెట్టి పూసి,తగరం రాజేష్,మరియమ్మ,మాడి గంగరాజు,టి.వెంకట్ రమణ, లక్ష్మణరావు,నూనె సత్యనారాయణ,పోలయ్య ఎలికా శ్రీనివాస్, ఎస్కే అన్వర్,ఎస్.కె షరీఫ్,ముల్లగిరి మోహనరావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో… కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు నేతృత్వంలో ఆదివారం బర్త్ డే కేక్ కట్ చేసి వారికి బర్త్ డే విషెస్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట పీఏసీఎస్ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,జూపల్లి ప్రమోద్,తగరం ముత్తయ్య,సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరదల మణికంఠ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -