నవతెలంగాణ- రాయపోల్ : రాష్ట్ర ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ప్రజాభవన్ లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని లింగారెడ్డిపల్లి మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజా పాలనలో రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలలో చేదోడు వాదోడుగా ఉంటూ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వీరారెడ్డి పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పాపని ఆంజనేయులు, లింగారెడ్డి పల్లి గ్రామ అధ్యక్షులు మర్రికింది స్వామి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం బట్టికి జన్మదిన శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES