- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
జిల్లా ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచించే వేడుక. “దీపావళి పండుగ వెలుగులు ప్రతి ఇంటిని ఆనందంతో, ప్రతి హృదయాన్ని ఆశతో నింపాలని కోరుకుంటున్నాను. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ప్రజల సంక్షేమం ఈ పండుగతో మరింతగా వృద్ధి చెందాలి,” అని తెలిపారు. అలాగే, “శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో వెలిగించిన దీపాలతో ప్రారంభమైన ఈ పండుగ చెడుపై మంచి గెలుపు అనే సందేశాన్ని ఈ పండుగ తరతరాలుగా మనకు అందిస్తుంది,” అన్నారు.
- Advertisement -