- Advertisement -
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిరు దివ్వెలతో చీకట్లను పారదోలేది ఈ దీపావళి పండుగనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధి ఎల్లప్పుడూ అందరి ఇండ్లలో వెల్లివిరియాలని కోరుకుంటూ తగు జాగ్రత్తలతో కుటుంబ సభ్యులందరు కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
- Advertisement -