- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
శనివారం జరగనున్న రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఉపవాస, ధ్యాన, దానధర్మ కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సహోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఆయన కొనియాడారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సామరస్యం నింపాలని ఆయన ముస్లిం సమాజానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



