- Advertisement -
నవతెలంగాణ – ముధోల్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మండలంలోని విట్టోలి గ్రామంలో గురువారం ఎంపీడీవో శివకుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణ కై మన వంతు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎంపీడీవో శివకుమార్ అన్నారు. ప్లాస్టిక్ ను నిర్ములించి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దు కుందామని అవగాహన కల్పించారు. అలాగే మండల కేంద్రమైన ముదోల్ లో అమృత్ ఆరోవర్ వద్ద మొక్క లు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శిరీష రెడ్డి, ఉపాధి సిబ్బంది పంచాయతీ కార్యదర్శిలు అనూష, తదితరులున్నారు.
- Advertisement -