ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లోని  జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యోగా మాస్టర్ జానీ  సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్‌ ఎం తరి రాము మాట్లాడుతూ ”యోగా వల్ల శారీరక ఆరోగ్యమే కాక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ప్రతి రోజూ యోగా సాధన విద్యార్థులు చేయటం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో మానసిక ఉల్లాసం కలగటమే కాక ఏకాగ్రత పెరిగి, చదువులో బాగా రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love