ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం 

– విద్యార్థినులతో ర్యాలీ, మనోహరం, రంగోలి నిర్వహించిన దృశ్యం
నవతెలంగాణ – మాక్లూర్: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు మండల తహశీల్దార్ షబ్బీర్ అధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబివి పాఠశాల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ కార్యాలయం ముందు మనోహరం చేపట్టి, విద్యార్థి నిలిచే రంగోలి నిర్వహించారు. రంగోలి గెలుపొందిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఎస్సై సుదీర్ రావు, సీనియర్ అసిస్టెంట్ వేణు, కస్తునిర్బా గాంధీ పాఠశాల ప్రత్యేక అధికారిని ప్రగతి, సిబ్బంది విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

charset=InvalidCharsetId

Spread the love