ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

నవతెలంగాణ- నిజాంసాగర్

మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థిని, విద్యార్థుల చేతుల మీదుగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ తెలిపారు. ఆమె మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం కోసం అతని జన్మదినని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం  అనేది ఆనవాయితీగా వస్తుంది  అలాంటి ఆదర్శవంతమైన ఉపాధ్యాయులుగా మనం కూడా రోల్ మోడల్ గా ఉండాలి.  వాళ్ళ జీవితంలో నుంచి మన నేర్చుకున్నవన్నీ కూడా పిల్లలందరికి కూడా కల్పించే విధంగా మోటివేట్ చేయాలి అని ఆమె అన్నారు పిల్లలు కూడా వాళ్ళు పెట్టుకున్న గమ్యాలను చేరుకోవాలని ఇలాంటి ఒడిదుడుకులు ఉన్న ఓపికతో ఉండాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Spread the love