విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తొలిసారిగా కలిసి చేస్తున్న పాన్-ఇండియా సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయికగా నటిస్తోంది. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి చిత్రాలతో పాపులరైన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని మేకర్స్ ప్రకటించారు.
యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ కలగలిసిన న్యూ జనరేషన్ మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని మేకర్స్ తెలిపారు. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ హిలేరియస్ పాత్రల్లో కనిపించనున్నారు. ప్రధాన నటీనటులు పాల్గొనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభమవుతుంది. ఈ పాన్-ఇండియా ఎంటర్టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, సిఇఓ: విష్ణు రెడ్డి.
విజయ్ సేతుపతి, పూరి చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్
- Advertisement -
- Advertisement -