విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘పిల్ల ఎక్కడుంది..’ సాంగ్ని రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధకృష్ణ అద్భుతమైన మాస్ నెంబర్గా కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల వోకల్స్ సాంగ్ ఎనర్జీని మరింత పెంచాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేకంగా పరామర్శ సభ ప్రెస్ మీట్ని నిర్వహించారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ,’గత సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళి ్లపోయింది. అప్పటి నుంచి ఇరుగుపొరుగు వారు, ఊర్లో వాళ్లు ఎన్నో విధాలుగా నన్ను విమర్శించారు. అందరూ ‘పాపం ప్రతాప్’ అని మాత్రమే అన్నారు. కానీ నా సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్లు ఎవరూ లేరు. ఈ నెల 17వ తేదీన నా బుజ్జమ్మతో మీ ముందుకు, మీ ఊర్లో థియేటర్లలో వస్తాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? అన్నది మీకు చూపిస్తాను. ఇప్పటివరకు పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటాను’ అని అన్నారు.తిరువీర్ హీరోగా, ఎస్.పి.దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’.కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఈనెల 17న



