నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండ కాస్తునే, ఆకాశంలో ఎలాంటి మార్పులు లేకుండానే, చడిచప్పుడు కాకుండా భారీ వర్షం పడింది. అరగంట పాటు ఈ భారీ వర్షం పడింది. ఇటీవల నాలుగు రోజులపాటు నిరంతరం కురిసిన వర్షాలతో పంట ధాన్యం తడిసి, మొలకలు రావడంతో రైతులు నష్టపోయి ఆందోళన చెందారు. గత మూడు రోజులుగా ఎలాంటి వర్షం లేకపోవడంతో తడిసిన ధాన్యాన్ని రైతులు కళ్లల్లో ఆరబెట్టుకుంటున్న తరుణంలో మరోసారి వరణుడు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే వర్షం రూపంలో కురవడంతో రైతుల నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది. వర్షం వచ్చే సూచనలు ఏమీ లేకపోవడంతో రైతులు పంట ధాన్యం కాపాడుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకునే సమయం లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షం కురిసి మరోసారి పంట ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వెలసిన తర్వాత ఎండ కాచినప్పటికీ, అప్పటికే భారీ వర్షం మూలంగా పంట ధాన్యం పూర్తిగా తడిసిందని రైతులు వాపోతున్నారు.
కమ్మర్ పల్లిలో భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES