Saturday, February 21, 2026
E-PAPER
Homeకరీంనగర్భారీ వర్షం.. ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు

భారీ వర్షం.. ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు

- Advertisement -

నవతెలంగాణ – గన్నేరువరం: మండలంలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా మండలంలోని జంగపల్లి ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షం నీటితో అవస్థలు పడుతున్నామని ఎస్సీ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు గ్రామ అధికారులకు విన్నవించిన కూడా పట్టించుకోవట్లేదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో బాధలు పడుతున్నాము. డ్రైనేజీలోని పూటిక తీసి వరద నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -