- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తీరం దాటిన వాయుగుండం దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో TGలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఉరుములు మెరుపులతో గంటకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
- Advertisement -