35 మందికి పైగా మృతి
కొలంబొ : వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో శ్రీలంక అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు ముంచెత్తడంతో సుమారు 35 మందికి పైగా మరణించినట్టు అధికారులు గురువారం ప్రకటించారు. గతవారం నుండికురుస్తున్న వర్షాలతో మృతుల సంఖ్య 31కి చేరింది. కొలంబోకు తూర్పున 300 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రావిన్స్లోని పర్వతప్రాంతాలైన బదుల్లా, నువారా ఎలియాలో అత్యధిక మరణాలు సంభవించిందని ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం గురువారం తెలిపింది. ఇవే ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరో 14మందికి పైగా గల్లంతైనట్టు వెల్లడించింది. వారాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు, పొలాలు, రహదారులను వరదలు ముంచెత్తాయి. పర్వతప్రాంతాలను రాళ్లు, బురద మరియు చెట్లు పట్టాలపై పడటంతో రైల్వే వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. పలు ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను కూడా మూసివేశామని ప్రకటించారు. వర్షాలు, ప్రతికూల వాతావరణంతో సుమారు 4,000 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది.
శ్రీలంకను ముంచెత్తిన భారీ వర్షాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



