- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :’మొంథా’ తుపాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా మంగళవారం భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
- Advertisement -



