Saturday, June 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహెలెన్‌ కెల్లర్‌ గొప్ప మానవతావాది

హెలెన్‌ కెల్లర్‌ గొప్ప మానవతావాది

- Advertisement -

పిల్లల మానసిక వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టండి : మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌
మలక్‌పేట్‌ వికలాంగుల వసతిగృహం సందర్శన
నవతెలంగాణ-మలక్‌పేట్‌

హెలెన్‌ కెల్లర్‌ గొప్ప మానవతావాదనీ, వికలాంగుల పట్ల ఆమె చూపిన ఆదరాభిమా నాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని వికలాంగుల వసతి గృహంలో శుక్రవారం హెలెన్‌ కెల్లర్‌ 145వ జయంతిని నిర్వహించారు. ఆమె విగ్రహానికి వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని వీరన్న, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అనితా రామచంద్రన్‌, సంచాలకులు శైలజతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం చైర్మెన్‌ అధ్యక్షత వహించిన సభలో మంత్రి మాట్లాడారు. హెలెన్‌ కెల్లర్‌ గొప్ప రచయిత్రి అనీ, ఆమె వికలాం గురాలు కావడంతో వైకల్యం వల్ల కలిగే సవాళ్ల ను అధిగమించే విధంగా ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, వారి పట్ల ప్రేమతో మెలగాలని చెప్పారు. మానసిక వికాసంపై అవగాహన కల్పించి వారిలో మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. సమాజంలో వికలాంగులకు ప్రత్యేక స్థానం ఉందనీ, వారి హక్కులు, చట్టాలు పూర్తిస్థాయిలో అమలు కావాలని అన్నారు. వికలాంగ విద్యార్థులు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగించుకోవాలని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతోపాటు నాణ్యమైన ఆహారం అందించి వారు ఎంచుకున్న క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వికలాంగ విద్యార్థులూ పదోతరగతి ఉత్తీర్ణతలో ముందుండటం హర్షించదగ్గ విషయమని మంత్రి అభినందించారు. వికలాంగ మహిళలు సంక్షేమం కోసం గ్రూపులుగా ఏర్పడితే తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 40 శాతం వికలాంగత్వం కలిగిన వారికి ఎటువంటి సహకారమూ అందించలేదని విమర్శించారు. సంస్థ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వికలాంగుల సంక్షేమానికి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలిపారు. డైరెక్టర్‌ శైలజ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు చదువుల్లో మిగిలిన విద్యార్థులతో పోటీగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వికలాంగ విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ అరుణ, సహాయ సంచాలకులు రాజేందర్‌, అక్బర్‌, మలక్‌పేట్‌ కార్పొరేటర్‌, ఏసీపీ బ్రహ్మం మురారి, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -