Monday, June 16, 2025
E-PAPER

హలో..హలో..

- Advertisement -

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలపై
పుతిన్‌, ట్రంప్‌ల మధ్య ఫోన్‌ సంభాషణ
మాస్కో :
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు శనివారం ఫోన్‌లో సంభాషించారు. ఫోన్‌కాల్‌ సంభాషణ గురించి ట్రంప్‌ తన సోషల్‌మీడియా ఖాతా ట్రూత్‌లో వెల్లడించారు. ఇరాన్‌ అణుస్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ చేస్తున్న నిరంతర దాడులు, ఇరాన్‌ ప్రతీకార దాడులపైనే తమ సంభాషణలో అధిక భాగం చర్చ జరిగిందని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌ను ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిపారు.పుతిన్‌ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం 79 ఏండ్లు పూర్తిచేసుకున్నారు. తనలాగే పుతిన్‌ కూడా ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధం ముగియాలని భావిస్తున్నారు. దాని గురించి చర్చించామని, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కూడా ముగియాలి అని కోరినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. సుమారు గంటసేపు సంభాషణ కొనసాగిందని తెలిపారు. ఇరాన్‌ మరియు ఇజ్రాయిల్‌ నేతలతో ఇటీవల జరిగిన చర్చల గురించి పుతిన్‌ ట్రంప్‌కు వివరించారని మరియు ఇరాన్‌ అణు సమస్యపై పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనాలన్న ప్రతిపాదనను పుతిన్‌ పునరు ద్ఘాటించారని రష్యా విదేశాంగ సలహాదారు యురి ఉషాకోవ్‌ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఖండించిన పుతిన్‌, ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ”మధ్యప్రాచ్యంలో అనూహ్య పరిణామాలకు” దారితీయవచ్చని పుతిన్‌ ఆందోళన వ్యక్తంచేశారని అన్నారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలను చేపట్టేందుకు పుతిన్‌ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు పునరుద్ఘాటించారు. ఇరాన్‌ అణు కార్యక్రమంపై అమెరికా -ఇరాన్‌ చర్చల సమయంలో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందాలను కనుగొనడం లక్ష్యంగా చర్యలను ప్రతిపాదించిందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -